
పంబన్ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం… నౌకలు వచ్చినప్పుడు…లిఫ్ట్ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45గంటలకు ప్రధాని మోదీ పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ తొలిసారి కొత్త బ్రిడ్జి కింద నుంచి వెళ్లింది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి, రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచి వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!
అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!
మీరు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నారా.. ఇది మీ కోసమే!
ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..