Andhra Weather: బిగ్ అలెర్ట్.. నేడు, రేపు రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు..

శనివారం తెలంగాణలోని కొమరం భీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఈ 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా ఈ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

మరోవైపు ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. శనివారం గరిష్టంగా నిజామాబాద్ లో 42.4, కనిష్టంగా హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్‌లలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

శుక్రవారం నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రామగుండం, నల్లగొండ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్.. 42.5,
ఆదిలాబాద్.. 41.8, మెదక్.. 41.8, రామగుండం.. 40,నల్లగొండ.. 40,  మహబూబ్ నగర్.. 39.2,  ఖమ్మం.. 39, భద్రాచలం.. 37.8, హైదరాబాద్.. 37.8, హనుమకొండ.. 37.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.