Mock Drill Reharsals: దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌.. 7న దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య వివిధ అత్యవసర పరిస్థితులకు సంసిద్ధతపై దృష్టి సారించి బుధవారం మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

హోం మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్షా సమావేశంలో 244 జిల్లా పౌర రక్షణ సంస్థాపనల పరిస్థితిని అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే ఉన్న పరికరాల పనితీరు, మరమ్మతుల అవసరం కూడా ఉంది. పౌరులకు శిక్షణ ఈ కసరత్తులలో కీలకమైన అంశంగా ఉంటుంది.

హోం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల సైరన్లు, బ్లాక్అవుట్ పరిస్థితులకు ఎలా స్పందించాలో దృష్టి సారించనున్నారు. అదనపు సామాగ్రి, టార్చెస్, కొవ్వొత్తులతో కూడిన మెడికల్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలని పౌరులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వైఫల్యాల వల్ల తలెత్తే పరిస్థితులను నిర్వహించడానికి ప్రజలు నగదును అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌ మోగబోతోంది. రేపు దేశవ్యాప్తంగా సివిల్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది రీహార్సాల్స్‌ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి.. గాయపడిన వారిని ఎలా తరలించాలి? ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేవి ఈ రీహార్సాల్స్‌లో చేపట్టారు. 1971 పాక్‌ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత భారత్‌-పాక్‌ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అన్ని జిల్లాలో రేపు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు. బెంగాల్‌లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్‌లో ఐదు చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్‌లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.