లవర్ కోసం 1200 కి.మీ ప్రయాణం చేసింది.. కట్ చేస్తే.. చివరికి ఊహించని ట్విస్ట్..!

ఇటీవల కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మొదలైన పరిచయంతో.. యువకుడిని ప్రేమించి, అతని కోసం తల్లిదండ్రులను కాదని, 1200 కిలో మీటర్లు దాటుకుంటూ వచ్చేసింది మైనర్ బాలిక. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది.

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని తన కుటుంబసభ్యలు మందలించడంతో.. తన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. ఆమె 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ చేరుకుంది. ఈ విషయం ప్రేమికుడికి తెలియగానే, మైనర్ బాలికను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మొండికేసింది. ఆ తరువాత ప్రియుడు, అతని అన్నయ్యతో కలిసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను సంప్రదించి ఆమెను తిరిగి వారికి అప్పగించారు.

ఆ మైనర్ బాలిక సోషల్ మీడియా ద్వారా ఆ అబ్బాయితో పరిచయమైంది. ఆ అబ్బాయి రీల్ చూసిన తర్వాత ఆ అమ్మాయి అతనికి మెసేజ్ చేసింది. తర్వాత వాళ్ళు స్నేహితులయ్యారు. మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఆ అబ్బాయికి తన స్నేహితురాలు తనను కలవడానికి ఇండోర్ వచ్చిందనే వార్త తెలియగానే, అతను కంగారుపడ్డాడు. ఆ బాలుడు తెలివితేటలు చూపించి ఆ అమ్మాయిని కాపాడాడు. తరువాత, చట్టపరమైన విధానాలను అనుసరించి, ఆమెను వారి కుటుంబానికి అప్పగించారు.

ఆ మైనర్ బాలిక ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాసింది. ఆమెకు 40 శాతం మార్కులు వచ్చాయి. అలాంటి పరిస్థితిలో, ఆమె తండ్రి ఆమెను మందలించాడు. ఆమె కోపంగా తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌ను కలవడానికి రైలులో ఇండోర్ చేరుకుంది. మరోవైపు, బాలిక అదృశ్యమైన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇరుగు పొరుగు పరిసరాల్లో వెతికారు. కానీ ఎటువంటి జాడ కనిపించలేదు. అయితే, మైనర్ బాలిక ప్రేమించింది ఇండోర్‌కు చెందిన బాలుడిని. ఆ అమ్మాయి ముజఫర్‌పూర్ నుండి నేరుగా ఇండోర్‌కు వెళ్లి ఖాండ్వాలో దిగింది.

ఆ అమ్మాయి తన ప్రియుడికి ఫోన్ చేసింది. ఖాండ్వా స్టేషన్‌కు అమ్మాయి వచ్చిందని సమాచారం అందిన తర్వాత, ప్రియుడు అక్కడికి చేరుకున్నాడు. ఆపై ఏదో ఒక సాకు చెప్పి ఆమెను నేరుగా ఖాండ్వా పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. అతను మొత్తం విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు ఇండోర్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఖాండ్వా పోలీసులు వెంటనే బాలికను వన్ స్టాప్ సెంటర్‌కు పంపారు. ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ అమ్మాయి కుటుంబ సభ్యులను పిలిచి ఖాండ్వాకు పిలిపించింది.

కమిటీ సభ్యులు విద్యార్థికి కౌన్సిలింగ్. ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కుటుంబం ముజఫర్‌పూర్ నుండి ఖాండ్వాకు చేరుకుంది. అక్కడ బాలల సంక్షేమ కమిటీ అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాత బాలికను కుటుంబానికి అప్పగించింది. ఆ అమ్మాయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు తాను ఆ రీల్ చేస్తుంటానని చెప్పింది. ఈ సమయంలో, ఆమె ఒక అబ్బాయి రీల్ చూసింది. అది ఆమెకు బాగా నచ్చింది. ఆమె చాలా కాలంగా సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అవుతూనే ఉంది. ఒక రోజు అతను ఆమెకు మెసేజ్ పెట్టాడు. తర్వాత వారు మాట్లాడుకోవడం ప్రారంభించారు. దాదాపు 8 నెలలు మాట్లాడుకున్న తర్వాత, ఇద్దరూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.

తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసినప్పుడు, అతని అన్నయ్య కూడా అతనితో పాటు వచ్చాడని ఆ విద్యార్థిని చెప్పింది. అతను వివరించి, ఇంకా మైనర్ అని, ఒక సంవత్సరం తర్వాత, ఇద్దరికీ పెళ్లి చేస్తామన్నారు. ప్రస్తుతానికి మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళాలని సూచించారు. కానీ ఆమె మొండికేయడంతో పోలీసులకు అప్పగించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.