ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ రెడీ?  ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి కీలక భేటీ!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పై భారతదేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదం పోరులో అమెరికా, రష్యా సహా అనేక ప్రపంచ దేశాలు భారతదేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా, దేశ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రధానమంత్రి నివాసంలో కలిశారు. నేవీ, వైమానిక దళ అధిపతుల తర్వాత, రక్షణ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏప్రిల్ 22న, అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన బైసారన్ వద్ద ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు 26 మంది అమాయకులను దారుణంగా హతమార్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది పర్యాటకులే. 2019 పుల్వామా దాడి తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా భారత్ భావించింది. ఈ దాడి తర్వాత భారతదేశం కఠినమైన చర్యలు తీసుకుంది.

ఏప్రిల్ 26న, ప్రధానమంత్రి మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాల అధిపతులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఇందులో ప్రధాని మోదీ పాకిస్తాన్‌పై చర్య తీసుకోవడానికి అన్ని దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘సైన్యం తన సౌలభ్యం ప్రకారం సమయం, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి’ అని ప్రధాని మోదీ సమావేశంలో అన్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం తర్వాత, పాకిస్తాన్‌లో భయం మొదలైంది. పాకిస్తాన్ సైన్యం ఎల్‌ఓసిపై కాల్పుల విరమణను నిరంతరం ఉల్లంఘిస్తోంది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది. మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్థాన్, చౌకబారు మిస్సైల్స్‌ను ప్రయోగిస్తూ, భారత్ దేశాన్ని రెచ్చగొడుతోంది.

ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గత ఆదివారం(మే 4) ప్రధానమంత్రి నివాసంలో భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఈ సమావేశం జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలకు చాలా ముఖ్యమైనది. ఈ సమావేశంలో ఐఏఎఫ్ చీఫ్ వైమానిక దళం సన్నాహాల గురించి ప్రధాని మోదీకి తెలియజేసినట్లు సమాచారం. శుక్రవారం (మే 2) నాడు, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కూడా లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రధానమంత్రిని కలిశారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో, నేవీ చీఫ్ నేవీ ప్రస్తుత సన్నాహాల గురించి వివరించారు. ఇటీవల, భారత నావికాదళ యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో అనేక నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించాయి.

పహల్గామ్ దాడి జరిగిన వెంటనే జరిగిన CCS సమావేశంలో పాకిస్తాన్‌కు భారతదేశం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. భారతదేశం పాకిస్తాన్ వీసాను కూడా రద్దు చేసింది. భారత్‌లో ఉన్న పాకిస్తానీ పౌరులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇస్లామాబాద్‌లోని హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించి,భారతదేశంలోని తన హైకమిషన్‌లో సిబ్బందిని తగ్గించాలని పాకిస్తాన్‌ను కోరింది. దీంతో పాటు, పాకిస్తాన్ విమానాలకు భారతదేశం గగనతలాన్ని, పాకిస్తాన్ జెండా ఎగురుతున్న నౌకలకు పోర్టు ప్రవేశాన్ని మూసివేసింది. పాకిస్తాన్ నుండి అన్ని రకాల దిగుమతులను భారతదేశం నిషేధించినప్పుడు పాకిస్తాన్ అతిపెద్ద దెబ్బను ఎదుర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.